Sunday, May 5, 2024

india corona: స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. తగ్గిన మరణాలు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో కొత్త‌గా 11,451 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా నుంచి 13,204 మంది కోలుకున్నారు. మరో 266 మంది వైరస్ తో మృతి చెందారు. కేర‌ళ‌లో నిన్న 7,124  క‌రోనా కేసులు నమోద‌య్యాయి. అదే సమయంలో 7,488 మంది కోలుకున్నారు. అలాగే, 21 మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం దేశంలో 1,42,826 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.42శాతం మాత్రమే ఉండగా.. రిక‌వ‌రీ రేటు 98.24 శాతంగా ఉంది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3,37,63,104 మంది కోలుకున్నారు. మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 4,61,057కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement