Monday, April 29, 2024

India Corona: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా.. 24 గంటల్లో ఎన్ని కేసులంటే..

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న వెయ్యి దిగువన నమోదైన కేసులు ఈ రోజు మాత్రం వెయ్యి దాటాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1088 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,38,016 కు చేరింది. ఇందులో 4,25,05,410 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

దేశంలో 26 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,21, 736 కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1081 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో 10,870 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 97.77 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,86,07,06,499 కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement