Tuesday, April 30, 2024

దేశంలో తగ్గిన మహమ్మారి విజృంభణ.. కొత్తగా 1225 కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి తగ్గుతోంది. నిన్నటితో పొల్చితే పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1225 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,24,440కు చేరింది. తాజాగా 28 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,21,129కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,594 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆ రికవరీల సంఖ్య 4,24,89,004కు పెరిగింది. ప్రస్తుతం దేశం  14,307 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,84,06,55,005 కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement