Friday, May 3, 2024

Covid-19: దేశంలో కొత్తగా 9,765 కేసులు.. 477 మరణాలు..

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్న వేళ.. దేశంలో దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,765 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. అదే సమయంలో 8,548 మంది కరోనా నుంచి బయటపడ్డారు. మరో 477 మంది మృతిచెందారు.

దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,45,96,776కు చేరింది. ఇందులో 3,40,37,054 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 99,763 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 4,69,724 మంది వైరస్ కి బలయ్యారు. దేశంలో ఇప్పటివరకు 1,24,96,19,515 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement