Friday, April 19, 2024

Allu Arjun: వరద బాధితులకు సహాయం.. అల్లు అర్జున్ భారీ విరాళం

భారీ వర్షాల, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి విరాళాలు వెల్లువెత్తున్నాయి. వరద బాధితులకు సహాయం చేయడానికి సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు విరాళాలు ప్రకటించారు. తాజాగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. ఏపీలో వచ్చిన భారీ వరదల కారణంగా ప్రజలు కష్టాల పాలవ్వడం తన మనసుని కలచి వేసిందని అల్లు అర్జున్ అన్నారు. వాళ్లకు తన తరపున సహాయం అందించడానికి ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ. 25 లక్షలు విరాళంగా ఇస్తున్నట్టుగా ప్రకటించారు.

కాగా, నిన్న చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి ప్రముఖులు వరుసగా 25 లక్షల రూపాయలను సిఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా అందించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement