Sunday, April 28, 2024

CORONA UPDATE: 149 రోజుల క‌నిష్టస్థాయికి యాక్టివ్ కేసులు

దేశంలో కోవిడ్​ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,401 మంది వైరస్ బారిన పడగా.. 530 మంది మరణించారు. కొత్తగా 39,157 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 3,64,129గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 149 రోజుల క‌నిష్టస్థాయికి చేరుకుంది.

దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,23,22,258కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 4,33,049కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,15,25,080 మంది కోలుకున్నారు. దేశంలో నిన్న 56,36,336 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 56,64,88,433 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

ఇది కూడా చదవండిః రూ.400 తగ్గిన వెండి.. నేటి బంగారం ధరలు ఇవి…

Advertisement

తాజా వార్తలు

Advertisement