Thursday, May 2, 2024

India Corona: దేశంలో కరోనా ఖతం.. కొత్తగా 2 వేల కేసులే..

ఇండియాలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య వేలల్లో నుంచి వందలకు దిగి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా దేశంలో రోజూ వారీ కరోనా కేసుల సంఖ్య నాలుగు వేలకు దిగువనే ఉంటుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా కేవలం 2075 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనాతో 71 మంది మరణించారు. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 3,383 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 27,802 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.56 శాతంగా ఉండగా… రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,24,61,926 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 5,16,352 మంది కరోనాతో మరణించారు. ఇక, దేశంలో మొత్తం 1,81,04,96,924 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement