Friday, May 3, 2024

India Corona: దేశంలో కరోనా టెర్రర్.. 24 గంటల్లో 4100 మంది మృతి

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గుతోంది. మరణాలు భారీగా పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1660 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,18,032కు చేరింది. అయితే, గడిచిన 24 గంటల్లో 4,100 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,20,855కి పెరిగింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,349 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4,24,80,436 కు చేరింది. ప్రస్తుతం దేశంలో 16,741 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  దేశం లో కరోనా పాజిటివిటి రేటు 89.16 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,82,87,68,476 కరోనా వ్యాక్సిన్లు డోసులు పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement