Thursday, May 2, 2024

ఇండియా కరోనా అప్డేట్..

దేశం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇవాళ కాస్త తగ్గింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 26,032 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 260 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 28,046 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,03,476 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. మరోవైపు.. రికవరీ కేసుల సంఖ్య 3,29,02,351 కు పెరగగా.. కోవిడ్‌ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 4,46,918 కు చేరింది.. ఇక, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 68,42,786 టీకా డోసులు పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు 85,60,81,527 డోసులు వేసినట్టు తెలిపింది కేంద్రం.

ఇది కూడా చదవండి: ప్రకాష్ రాజ్ ను లోకల్, నాన్-లోకల్ అంటూ విమర్శలు చేయటం తప్పు: పవన్

Advertisement

తాజా వార్తలు

Advertisement