Friday, May 3, 2024

దేశంలో నిన్న 42 వేల కరోనా కేసులు నమోదు..

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 42,766 క‌రోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, నిన్న 45,254 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,95,716కు చేరింది. మరణాల విషయానికొస్తే, నిన్న‌ 1,206 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం  4,07,145కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,99,33,538   మంది కోలుకున్నారు. 4,55,033 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది.

ఇది కూడా చదవండి: జికా వైరస్ లక్షణాలు ఇవే..

Advertisement

తాజా వార్తలు

Advertisement