Saturday, May 4, 2024

పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 16,561 పాజిటివ్ కేసులు

కరోనా కేసులు దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.. ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గురువారం 16,299 మందికి పాజిటివ్‌రాగా, ఈరోజు ఆ సంఖ్య 16,561కి పెరిగింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,42,23,557కు చేరింది. ఇందులో 4,35,73,094 మంది కోలుకోగా, 5,26,928 మంది మహమ్మారితో మరణించారు. మరో 1,23,535 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 18,053 మంది కరోనా నుంచి బయటపడ్డారని, 49 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక రోజువారీ రికవరీ రేటు 5.44 శాతానికి పెరిగిందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement