Friday, May 3, 2024

Breaking: అంబులెన్స్‌లో అక్ర‌మంగా ఆవుల త‌ర‌లింపు.. సిలిండ‌ర్ పేలి సజీవ దహనం

నిజామాబాద్ ఇంద‌ల్వాయి ద‌గ్గ‌ర ఘోరం జ‌రిగింది. ఓ అంబులెన్స్‌లో అక్ర‌మంగా ఆవుల‌ను త‌ర‌లిస్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. సిలిండ‌ర్ పేల‌డంతో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో మంట‌ల్లో ఆవులు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యాయి. మంట‌లంటుకుని ఆవులు పెట్టిన ఆక్రంద‌న‌ల‌తో ఆ ప్రాంతం ద‌ద్ద‌రిల్లింది. కాగా, నిజామాబాద్ నుంచి హైద‌రాబాద్‌కు ఈ ఆవుల‌ను అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న‌ట్టు తెలుస్తోంది. రంజాన్ పండుగ కోస‌మే వీటిని త‌ర‌లిస్తున్నరా? లేక దేనికోసం అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఘ‌ట‌న‌తో డ్రైవ‌ర్ వేహిక‌ల్ వ‌దిలేసి ప‌రార‌య్యాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement