Friday, April 26, 2024

ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారిస్తే నెంబ‌ర్ వ‌న్ గా ఎదుగుతాం.. మంత్రి కేటీఆర్

మ‌న దేశంలో ఆర్థికాభివృద్ధి కన్నా.. రాజకీయాలపై దృష్టిపెడతారని, అయితే ఇతర దేశాల్లా మన దేశంలోనూ ఆర్థికాభివృద్ధిపై దృష్టిసారిస్తే నంబర్‌ వన్‌గా ఎదుగుతామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఎన్‌హెచ్‌ఆర్డీ ‘డీకోడ్‌ ది ఫ్యూచర్‌’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సుకు మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. బడ్జెట్‌లో దేశ అభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటం లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని విమర్శించారు.

చైనా, జపాన్‌ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని చెప్పారు. ప్రపంచంలో గుర్తించదగిన బ్రాండ్స్‌ మన దేశం నుంచి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. మనదేశంలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. మొత్తం జనాభాలో 60శాతం మంది యువతేనని తెలిపారు. దేశంలో యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నదని వెల్లడించారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆలోచన చేయడం లేదన్నారు. సింగపూర్ విస్తీర్ణంలో హైదరాబాద్‌ కన్నా చిన్నగా ఉంటుంది. అయినా అభివృద్ధిలో మాత్రం వేగంగా ముందుకెళ్తున్నదని చెప్పారు. గత ఎనిమిదేండ్లుగా అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ.. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నది. దేశ జీడీపీలో 5 శాతం వాటా తెలంగాణదే అని తెలిపారు. 4.6 ట్రిలియన్‌ ఎకానమీకి తెలంగాణ చేరుకుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement