Sunday, April 28, 2024

సంక‌ల్పం గొప్ప‌దైతే.. ఎంత‌టి విప‌త్తు వ‌చ్చినా ఎదురొడ్డి నిల‌బ‌డొచ్చు..

బ‌త‌కాల‌న్న ఆశ ఉండాలే కానీ.. బండ‌పైన కూడా ఏపుగా ఎదిగే మొక్క‌ల్ని మ‌నం చూస్తూనే ఉంటాం.. ఎండిపోయిన ఎన్నో చెట్లు వాటి కాండం నుంచి మ‌ళ్లీ మొల‌కెత్తుతూ ఉంటాయి.. ఇవి చిన్న చిన్న ఇష్యూస్‌కే సూసైడ్‌ చేసుకోవాలి అనుకునే వారికి ఓ గుణ‌పాఠం నేర్పుతాయి అన‌డంలో సందేహం లేదు..

అయితే.. ఈ చెట్టు రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని సుద్ధాల విలేజ్‌లో ఉంది. మొత్తానికే ఎండిపోయిన ఈ చెట్టు.. మ‌ళ్లీ పురుడుపోసుకుని.. నిలువెల్లా ప‌చ్చ‌ని ఆకుల‌తో క‌నుల‌విందు చేస్తోంది. ఈ ఫొటోని కోదాటి జితేంద‌ర్ రావు ట్విట్ట‌ర్‌లో షేర్ చేయ‌గా.. మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌(గ్రీన్ ఇండియా చాలెంజ్‌), తెలంగాణ డిజిట‌ల్ మీడియా డైరెక్ట‌ర్ కొణ‌తం దిలీప్ తోపాటు చాలా మంది లైక్ చేస్తూ, రీ ట్వీట్ చేస్తున్నారు. ఈ ఫొటోను మీరు చూడండి మ‌రి..

Advertisement

తాజా వార్తలు

Advertisement