Friday, April 26, 2024

Breaking: పేలిన ఐఈడీ.. ఒకరు మృతి..

ఐఈడీ పేలి ఒక‌రు మృతిచెందిన ఘ‌ట‌న‌ జార్ఖండ్ రాష్ట్రంలోని వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలో చోటుచేసుకుంది. టోంటో ఏరియాలోని రెగ్ర‌హ‌టూ గ్రామ స‌మీపంలో ఐఈడీ పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి ఓ వ్య‌క్తి మృతి చెందాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారు. మృతుడిని రెగ్ర‌హ‌టూ గ్రామానికి చెందిన చేత‌న్ కోడాగా పోలీసులు గుర్తించారు. చేత‌న్ కోడా అడ‌విలోకి క‌ట్టెల కోసం వెళ్లిన స‌మ‌యంలో ఈ పేలుడు సంభ‌వించిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement