Thursday, April 25, 2024

అభివృద్ధి అదుర్స్… మంత్రి కేటీఆర్‌ దత్తతతో కొడంగల్‌కు కొత్త రూపు.. (ఇవిగో చిత్రాలు)

కొడంగల్‌ నియోజకవర్గం కొత్త రూపును సంతరించుకున్నది. ఎన్నిక‌ల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా కొడంగ‌ల్ ను రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ దత్తత తీసుకోవ‌డంతో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగింది. ఇప్పటి వరకు రూ.350 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఎన్నికల హామీ మేరకు కొడంగల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి గ్రామానికీ రోడ్డు సౌకర్యం, కోట్లాది రూపాయలతో కమ్యూనిటీ హాళ్లు, చెక్ డ్యాంలు, ప్రభుత్వ దవాఖానలు, మినీ ట్యాంక్ బండ్లు, కోస్గిలో బస్‌ డిపో, బస్ స్టేషన్‌, కొడంగల్‌లో డిగ్రీ కాలేజీ నిర్మాణానికి కృషి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement