Monday, April 29, 2024

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేత న్యూజిలాండ్

సౌతాంప్టన్ వేదికగా టీమిండియాతో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ విజయకేతనం ఎగురవేసింది. భారత్ నిర్దేశించిన 139 పరుగుల టార్గెట్‌ను రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కివీస్ ఛేదించింది. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ (52), రాస్ టేలర్ (47) తుది కంటా నిలబడి తమ జట్టును విజయ తీరాలకు చేర్చారు. కాగా రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా 170 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్‌ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. దీంతో తొలిసారి నిర్వహించిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ టైటిల్‌ను విలియమ్సన్ సేన ఎగురవేసుకుని పోయి టీమిండియాకు నిరాశను మిగిల్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement