Friday, April 26, 2024

Telangana: ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ఐఏఎస్ ఆఫీస‌ర్ డెల‌వ‌రీ.. పండంటి మగబిడ్డ, త‌ల్లీబిడ్డ‌లు క్షేమం!

తెలంగాణ‌కు చెందిన మ‌హిళా ఐఏఎస్ అధికారిణి, ప్రస్తుతం ములుగు జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్‌ త్రిపాఠి ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌లో డెలివ‌రీ అయ్యారు. పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చారు. 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన త్రిపాఠి ములుగు జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ (స్థానిక సంస్థ‌లు)గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఈ జిల్లాకు పొరుగునే ఉన్న జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా క‌లెక్ట‌ర్‌గా ఆమె భ‌ర్త‌ భ‌వేశ్ మిశ్రా ప‌నిచేస్తున్నారు. త్రిపాఠికి సోమ‌వారం రాత్రి పురిటి నొప్పులు ప్రారంభం కాగా… ఆమెను భ‌వేశ్ మిశ్రా భూపాల‌ప‌ల్లిలోని ఏరియా ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.

విష‌యం తెలుసుకున్న హాస్పిట‌ల్ సూప‌రింటెండెంట్ సంజీవ‌య్య అక్క‌డ ప‌నిచేస్తున్న గైన‌కాల‌జిస్ట్‌ల‌ను ర‌ప్పించారు. సాధార‌ణ ప్ర‌స‌వానికే వైద్యులు య‌త్నించ‌గా.. గ‌ర్భంలోని మ‌గ శిశువు బ‌రువు అధికంగా ఉండ‌టంతో సోమ‌వారం రాత్రి సిజేరియ‌న్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. ప్ర‌స‌వం త‌ర్వాత త‌ల్లీబిడ్డ‌లు ఆరోగ్యంగా ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. రాష్ట్రంలో స‌ర్కారు ఆస్ప‌త్రుల్లో పెరిగిన వ‌సతుల‌కు నిద‌ర్శ‌న‌మే ఈ ఘ‌ట‌న అని అధికార టీఆర్ఎస్‌కు చెందిన నేత‌లు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement