Thursday, April 25, 2024

Breaking: స‌ఫారీల‌తో ఆఖ‌రి టీ20 ప్రారంభం.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా!

సౌతాఫ్రికా, ఇండియా మ‌ధ్య జ‌రుగుతున్న టీ20 సిరీస్‌లో ఇవ్వాల (మంగ‌ళ‌వారం) మూడో మ్యాచ్ జ‌రుగుతోంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ స్టేడియంలో ఈ మ్యాచ్ కొద్దిసేప‌టి క్రిత‌మే ప్రారంభ‌మైంది. కాగా, తొలుత టాస్ గెలిచిన టీమిండియా సార‌ధి రోహిత్‌శ‌ర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో స‌ఫారీలు తొలుత బ్యాటింగ్ చేస్తున్నారు. ఓపెన‌ర్లుగా క్వింట‌న్ డికాక్‌, కెప్టెన్ బావుమా బ్యాటింగ్‌కు వ‌చ్చారు. అయితే.. ఇప్ప‌టికే రెండు మ్యాచ్‌లు గెలుచుకున్న టీమిండియా 2.0తో సిరీస్‌ని సొంతం చేసుకుంది. ఇక ఆఖ‌రి మ్యాచ్‌లో అయినా గెలిచి ప‌రువు కాపాడుకోవాల‌ని స‌ఫారీలు భావిస్తుండ‌గా.. ఈ మ్యాచ్ కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాల‌ని టీమిండియా ఉవ్వీళ్లూరుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement