Thursday, April 25, 2024

హైద‌రాబాద్‌లో దారుణం.. బిర్యానీ కోసం వెళ్తే కొట్టి చంపేశారు..

హైద‌రాబాద్‌లో దారుణం జ‌రిగింది. బిర్యానీ కోసం వెళ్లిన ఓ వ్యక్తిని రెస్టారెంట్ సిబ్బంది కొట్టి చంపిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగుచూసింది. కేబిహెచ్‌బీ కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన రాజేశ్ మాదాపూర్​లో ఫ్యామిలీతో సహా నివసిస్తున్నాడు. ప్రగతి నగర్ లో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మొన్న‌ రాత్రి పని ముగించుకుని ఆర్ధ‌రాత్రి బిర్యాని కోసం కూకట్​పల్లి జాతీయ రహదారిపై ఉన్న మొఘల్స్ ప్యారడైజ్ రెస్టారెంట్ సెల్లార్​ వద్దకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడ ఆ హోటల్ మేనేజర్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న సిబ్బంది సెల్లార్ లో రాజేశ్ ను చూసి దొంగగా భావించారు.

దీంతో విషయాన్ని పోలీసులకు చెప్పకుండా అతడిపై అటాక్‌చేసి తీవ్రంగా కొట్టారు. మరుసటి రోజు హోటల్ కు వచ్చిన సిబ్బంది అక్కడే పడి ఉన్న రాజేశ్ ను చూసి అతడి జేబులో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా అత‌ని భార్యకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నరాజేశ్ భార్య, అతడిని ఇంటికి తీసుకొని వెళ్లింది. ఇంటికి వెళ్లిన కాసేపటికే రాజేశ్ చ‌నిపోయాడు. దీంతో రాజేశ్ భార్య ఈ ఘ‌ట‌న‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మద్యం మత్తులో నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్న ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన నలుగురు రెస్టారెంట్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement