Friday, April 19, 2024

రూపం మారే అమ్మవారు!

విజయనగరం జిల్లా సాలూరు ప్రాంతంలో అతి ఎత్తయిన కొండపై వెలసి ఉంది పార్వతీదేవి. అతిపురాతనమైనదిగా భావిస్తున్న ఈ పార్వతీదేవి విగ్రహాన్ని సుమారుగా 2400 సంవత్సరాలకు పూర్వమే ప్రతిష్టించి ఉండొచ్చు అని
పురావస్తు శాఖ వారు నిర్థారించారు.

అమ్మవారు వెలసిన ఈ శిఖరం శివలింగాకారంలో ఉం టుంది. చాలా ఎత్తుగా ఉండే ఈ శిఖరంపై అమ్మవారి విగ్ర హాన్ని దేవతలు ప్రతిష్టించారు అంటారు. మహిమ గల ఈ అమ్మవారి విగ్రహం 3 చేతులు శిరస్సు శివుడు కలిగి ప్రపంచంలోనే ప్రత్యేకమైనదిగా కనిపిస్తోంది. జైనం మతానికి సంబంధించిన కొన్ని పురాతన గ్రంథాలలో కూడా ఈ అమ్మవారి చరిత్ర ఉంది. ఈ అమ్మవారి రూపం ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటుంది. ఒకసారి నవ్వుతూ ఒకసారి చిన్న పిల్లలా ఒకసారి మౌనంగా ఒకసారి పెద్దమ్మలా ఇలా చాలా రకా లుగా మారుతూ మనకు కనిపిస్తుంది. కొన్ని విశిష్టమైన రోజుల్లో, ఆమావాస్య రాత్రులలో కొండపై వెలుగులతో కూడిన జ్యోతులు కనిపిస్తాయి అని ప్రత్యక్షంగా చూసిన కొండ క్రింద గ్రామాలలో నివసించే గిరిజనులు చెప్తారు. ఇప్పటికీ అమ్మవారిని దేవతలు జ్యోతిరూపంలో దర్శించి పూజిస్తారని ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ కొండ మధ్యలో ఓ గుహ వుంది. ఇక్కడ పాండవులు వనవాస సమయంలో కొద్దిరోజులు ఉన్నారట. అందుకే ఆ గుహకు పాండవుల గుహ అని పేరు. ఈ మహిమగల కొండపై ధ్యానం చేసేవారికి త్వరగా సిద్ధులు లభిస్తాయనే విశ్వాసం. సిద్ధులు ప్రసాదిస్తుంది కనుక తల్లిని సిద్ధేశ్వరి అని.. చేతిలో చక్రా లు వున్నాయి కనుక చక్రేశ్వరి అని పార్వతీదేవి కనుక పారమ్మతల్లి అని అమ్మవారిని రకరకాలుగా పిలుస్తారు. దేవతలచే నిత్యం పూజింపబడే అమ్మను ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున మాత్రమే వేలమంది భక్తులు దర్శిస్తారు. మిగతారోజుల్లో ఈ కొండ ఎక్క డం చాల కష్టం. ఒకవేళ కొండ ఎక్కి అమ్మవారిని దర్శించాలి అంటే స్థానిక గిరిజనుల సహాయం తీసుకోవాల్సిందే.
– దైతా నాగ పద్మలత

Advertisement

తాజా వార్తలు

Advertisement