Friday, May 3, 2024

Crime: వరకట్నం కోసం బరితెగింపు.. గర్భిణిని చిత్రహింసలు పెట్టి హత్య

అదనపు కట్నం కోసం అత్తింటి వారు బరితెగించారు. గర్భిణీ అని కూడా చూడకుండా కోడలిని చిత్రహింసలకు గురి చేసి  హత్య చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వర్ని మండలం రాజ్పేట్ తండాకు చెందిన తరుణ్ తో మల్కాపూర్ కి చెందిన కళ్యాణి(24)కి రెండేళ్ల క్రితం పెద్దలు వివాహం జరిపించారు. కొన్నాళ్ల పాటు భర్త,అత్తింటివారు కళ్యాణిని బాగానే చూసుకున్నారు. అనంతరం అదనపు కట్నం కోసం ఆమెను హింసించడం మొదలుపెట్టారు. కొంతకాలానికి కళ్యాణి గర్భం దాల్చినప్పటికీ వారి వేధింపులు ఆగలేదు. ఆమెను దారుణంగా చిత్రహింసలు పెట్టారు. ఈ క్రమంలో మంగళవారం భర్త తరుణ్, మామ ఫకీరా, బంధువు ప్రవీణ్ ఆమెతో విషం తాగించారు. అంతటితో ఆగకుండా యాసిడ్ కూడా నోట్లో పోశారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో పక్కింట్లో ఉంటున్న ఆమె అక్క శోభ అక్కడకు వచ్చింది. అప్పటికే కళ్యాణి నురగలు కక్కుతూ పడిపోయి కనిపించింది. వెంటనే ఆమెను నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా బుధవారం కన్నుమూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement