Friday, May 3, 2024

రెస్టారెంట్ లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణ నష్టం

ఓ రెస్టారెంట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ రెస్టారెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో భారత మాజీ క్రికెటర్ జహీరో ఖాన్ రెస్టారెంట్ ఉంది..కాగా జహీర్ ఖాన్ రెస్టారెంటుకు ఏదైనా నష్టం వాటిల్లిందో లేదో తెలియాల్సి ఉంది. కాగా పూణె నగరంలోని లుల్లా నగర్ చౌక్‌లో ఉన్న మార్వెల్ విస్టా భవనం పై అంతస్తులో ఉదయం 8.45 గంటల సమయంలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు చెలరేగడంతో పై అంతస్తు కిటికీలు, ఇతర వస్తువులు కిందపడ్డాయి. అయితే, ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఏడు అంతస్తుల భవనంలోని పై ఫ్లోర్ లో మంటలు, దట్టమైన పొగ కమ్ముకోవడాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి, మంటలను అందుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం కారణంగా ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఆస్తి నష్టంపై అంచనా వేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement