Friday, May 3, 2024

Spl Story | భారీగా పెరిగిన ఎమ్మెల్యేల ఆస్తులు.. బీజేపీ ఎమ్మెల్యేలే టాప్​ లెవల్​!

తెలంగాణలో రాజకీయాలు స్పీడందుకున్నాయి. ఇప్పుడంతా పార్టీల వారీగా విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ రచ్చ సాగుతోంది. అయితే.. మరోవైపు త్వరలో జరగనున్న జనరల్​ ఎలక్షన్స్​కి ఎన్నికల కమిషన్​ ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని యూత్​ కూడా పాలిటిక్స్​ తీరును నిశితంగా గమనిస్తున్నారు. 2014 నుంచి 2018 వరకు.. ఆ తర్వాత ఎమ్మెల్యేల ఆస్తులు ఎలా పెరిగాయి..? ఎంత పెద్దమొత్తంలో ఉన్నాయనే దానిపై ఆరా తీస్తున్నారు. బీజేపీ నేతలు చాలామంది ఆరోపణలు చేసినట్టు తెలంగాణలో అవినీతి జరిగిందా? ఏ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారు అనే విషయాలు కూడా చర్చిస్తున్నారు. ఇక.. ఇప్పుడు ఎలక్షన్​ వాచ్​ అండ్​ అసోసియేషన్​ ఫర్​ డెమోక్రటిక్​ రిఫార్మ్స్​ రిలీజ్​ చేసిన రిపోర్టుతో దిమ్మదిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాలేంటో లెక్కల వారీగా తెలుసుకుందాం..

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లు తమ శాసనసభ్యుల నికర ఆస్తుల విలువల విషయాన్ని ఆరా తీస్తున్నారు. గెలిచేదాకా ఎంతుండే.. ఆ తర్వాత ఎంతగా ఆస్తులు పెరిగాయనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 2018లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలంతా స్వయంగా ప్రమాణ స్వీకారం చేసిన అఫిడవిట్లను విశ్లేషించి తెలంగాణ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఓ రిపోర్టు విడుదల చేసింది. 2014 నుంచి 2018 వరకు పార్టీల వారీగా ఎన్నికైన ఎమ్మెల్యేల సగటు ఆస్తుల పెరుగుదల ఎట్లుందో ఇక్కడున్న చార్ట్​లో చూడొచ్చు.

ప్రధానంగా ఇందులో.. బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఆస్తులు గణనీయంగా అంటే 3376శాతం పెరిగినట్టు స్పష్టమవుతోంది. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేల ఆస్తులు కూడా 133శాతం పెరిగాయి.  ఆ తర్వాత బీఆర్​ ఎస్​ ఎమ్మెల్యేల ఆస్తులు 77.85శాతం, ఎంఐఎం ఎమ్మెల్యేల ఆస్తులు 42శాతం పెరగగా.. అందరికంటే తక్కువగా కాంగ్రెస్​ ఎమ్మెల్యేల ఆస్తులు తక్కువ శాతం పెరిగినట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. వీరి ఆస్తుల విలువ కేవలం 24 శాతం మాత్రమే పెరిగింది.

తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీల్లో బీజేపీ ఎమ్మెల్యేల ఆస్తులు మాత్రమే పెరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. వీరి ఆస్తులు అత్యధికంగా పెరిగినట్టు అసోసియేషన్​ ఫర్​ డెమోక్రటిక్​ రిఫార్మ్స్​ నివేదిక స్పష్టం చేస్తోంది. 2014లో బీజేపీ ఎమ్మెల్యే సగటు ఆస్తులు రూ. 9 లక్షలు ఉండగా.. 2018లో వారి ఆస్తుల విలువ రూ. 3 కోట్లకు పెరిగి 3376.08గా నమోదైంది. ఇక బీఆర్ఎస్ విషయానికొస్తే  ఆ పార్టీ ఎమ్మెల్యేల సగటు ఆస్తులు 77.85 శాతం పెరిగినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement