Sunday, April 28, 2024

ఆసుప‌త్రి నుంచి క‌మ‌ల్ హాస‌న్ డిశ్చార్జ్ – ఆరోగ్యంగా ఉన్నార‌న్న డాక్ట‌ర్స్

రీసెంట్ గా క‌రోనా బారిన ప‌డ్డారు విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్. కాగా క‌రోనా నుంచి కోలుకున్న ఆయ‌న్ని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే తాజాగా మ‌రోసారి ఆయ‌న ఆసుప‌త్రిలో జాయిన్ అయ్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యంగా ఉన్నార‌ని డాక్ట‌ర్స్ వెల్ల‌డించారు. కరోనా బారినపడిన కమల్ గతేడాది నవంబరులో దాదాపు పది రోజులకుపైగానే ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కోలుకుని తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్’ షోలో పాల్గొన్నారు.సోమవారం మరోమారు పోరూరులోని ఆసుపత్రిలో చేరడంతో ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, ఆయన సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రిలో చేరారని తెలిసింది. వైద్య పరీక్షల అనంతరం కమల్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించడంతో డిశ్చార్జ్ అయ్యారు. కాగా, లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘విక్రం’ షూటింగులో ఈ నెల 25 నుంచి కమల్ పాల్గొంటారట‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement