Saturday, April 27, 2024

Breaking: హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో పల్లెల నుంచి పట్నం బాట పడుతున్నారు జనాలు. నేటి నుంచి ఆఫీస్ లు తెరుచుకోవడంతో సొంతూళ్ల నుంచి హైదరాబాద్ కు ప్రయాణం అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ – విజయవాడ హైవేపై వాహనాల రద్దీ భారీగా పెరిగి పోయింది. రద్దీ దృష్ట్యా పంతంగి టోల్ ప్లాజా, కొర్లపాడు టోల్ ప్లాజాల వద్ద అధికారులు అదనపు టోల్ చెల్లింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు సాధారణం కంటే హైవేపై రెట్టింపు వాహనాలు వస్తున్నాయి. దీంతో అధికారులు దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అటు సొంతూళ్ల నుంచి.. హైదరాబాద్‌ కు వచ్చే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా 3500 బస్సులను ఏర్పాటు చేసింది.

మరోవైపు కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థల సెలవులను ప్రభుత్వం పెంచేసింది. జనవరి 16వ తేదీతో ముగియాల్సిన సంక్రాంతి సెలవులు.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో జనవరి 30 వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement