Friday, April 26, 2024

రోడ్డుపై దోశ తింటోన్న ల‌లిత జ్యూయ‌ల‌రీ అధినేత – హ్యాట్సాఫ్ అంటోన్న నెటిజ‌న్స్

ఎన్నో జ్యూవెల‌రీ షాపులు ఉన్నాయి..వాటికి ప‌లు ర‌కాలుగా మోడ‌ల్స్, హీరోయ‌న్స్ ని పెట్టి ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి మ‌రీ యాడ్స్ ని రూపొందించి ప్ర‌చారం చేస్తుంటాయి. అయితే ఈయ‌న రూటే స‌ప‌రేటు..జ్యూవెల‌రీ షాప్ ఎండీ అయినా త‌నే ప్ర‌చారాన్ని స్వ‌యంగా చేస్తుంటారు..యాడ్స్ అంటూ ప్ర‌త్యేకంగా ఏం చేయ‌రు. ఆయ‌నే లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్..డ‌బ్బులు ఎవ‌రికీ ఊరికే రావంటూ అంద‌రికీ సుప‌రిచితుడుగా మారారు. కాగా ఆయ‌న నెల్లూరు జిల్లాలో ఓ దోశ బండి దగ్గర దోశ తింటున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.గతంలో మీడియా ప్రపంచంలో లలిత జ్యువెలర్స్ యాడ్ ఓ కొత్త సునామీ సృష్టించింది. కిర‌ణ్ కుమార్ వ‌య‌సు 50ఏళ్ళు.. దక్షిణ భారతదేశంలో లలిత జ్యువెలర్స్ కు ప్రస్తుతం చాలా షో రూమ్ లు ఉన్నాయి.1985 లో మొదట చెన్నైలో లలిత జ్యువెలర్స్ షోరూం ప్రారంభించారు.ఆయన పెద్దగా చదువుకోలేదు కానీ 1999 లో లలిత జ్యువెలర్స్ సంస్థను కిరణ్ కుమార్ టేకోవర్ చేశారు.ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వంలా కిరణ్ కుమార్ నెల్లూరులో దోశ బండి దగ్గర దోశ తింటున్న దృశ్యాలు ఆశ్చర్య పరిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement