Wednesday, May 15, 2024

క‌ట్టుకున్న పెళ్లాన్ని 5 వేల‌కే అమ్మేశాడు..

ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు త‌న సొంత పెళ్లాన్ని అయిదు వేలకు అమ్మేశాడో ద‌రిద్రుడు.. ఈ ఘ‌ట‌న రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. మాల్ పూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యను 5 వేల రూపాయలకు ఇద్దరు వ్యక్తులకు అమ్మిన విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఆ వ్య‌క్తి చేసుకున్న‌ ఒప్పందం ప్రకారం వారిద్ద‌రు కూడా త‌న భార్యతో గడపాల్సి ఉంటుంది. ఈ విషయం భార్యకు తెలియదు. ఒక రోజు ఆ ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చారు. త‌మ ఒప్పందం ప్రకారం వారితో గడపాలని భార్యకు భర్త చెప్పడంతో ఆమె షాక్‌కి గుర‌య్యింది.

వారి ఒప్పందం విష‌యాన్ని చెప్ప‌డంతో ఆమె నిరాకరించింది. అయితే భర్తతో పాటు వచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా ఆమెను విపరీతంగా కొట్టారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విష‌యాన్ని బాధితురాలు పోలీసులకు కంప్లెయింట్ చేసింది. పోలీసులు ఈ కేసును సీరియ‌స్‌గా తీసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని ఈ ఘ‌ట‌న‌ తీరుపై ఎంక్వైరీ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement