Wednesday, May 15, 2024

హ‌నుమాన్ శ్లోకం ట్వీట్ చేసిన – ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు హ‌నుమాన్ జ‌యంతి శుభాకాంక్ష‌లు చెప్పారు టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఈ సంద‌ర్భంగా హ‌నుమాన్ శ్లోకాన్ని క‌విత ట్వీట్ చేశారు. దాంతో పాటు హ‌నుమంతుడి శ్లోకాన్ని ప‌ఠించిన వీడియోను కూడా క‌విత షేర్ చేశారు.

క‌విత ట్వీట్ చేసిన శ్లోకం ఇదే..
బుద్దిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగతా
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్భవేత్
(చక్కని ఆలోచనను సరైన వేళలో అందించగల బుద్ధీ, ఆ ఆలోచనలను అమలుచేయగల మనోబలం. అలా అమలుచేసి సత్ఫలితాన్ని సాధించినందువల్ల చక్కని కీర్తి. ఇలాంటి కీర్తిని సాధించిన కారణంగా మరో మంచిపనిని కూడా సాధించగలమనే ధైర్యం, అలా ధైర్యంగా పనిచేస్తున్నందు వల్ల భయం లేనితనం.

Advertisement

తాజా వార్తలు

Advertisement