Saturday, May 4, 2024

గులాబీ పండుగలో గుమగుమలు.. గుబాలించనున్న ప్రత్యేక వంటకాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీఆర్‌ఎస్‌ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం హైదరాబాద్‌ హైటెక్స్‌లో జరగనున్న ఈ వేడుకలకు హాజరయ్యే ప్రతినిధులకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. గులాబీ పండుగలో ప్రత్యేక వంటకాలు ఘుమఘుమలాడనున్నాయి. తెలంగాణ సాంప్రదాయ వంటకాలతో పాటు పలు నోరూరించే ఇతర వంటకాలతో విందు సిద్ధం చేస్తున్నారు.

ఈ మేరకు ప్లీనరీ భోజన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే ఎమ్‌.సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రావు, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌లు ఆదివారం హైటెక్స్‌ వేదిక వద్ద భోజన ఏర్పాట్లపై పరిశీలించారు. మహిళాప్రతినిధులు, పోలీసు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక భోజనస్టాల్‌లను ఏర్పాటు చేస్తామని భోజన కమిటీ ఇన్‌ఛార్జ్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement