Sunday, April 28, 2024

Update: గుజ‌రాత్‌లో ఘోరం, కేబుల్ బ్రిడ్జి కూలి 32 మృతి.. కొన‌సాగుతున్న సహాయ‌క చ‌ర్య‌లు

గుజ‌రాత్ రాష్ట్రంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఆదివారం మోర్బీ ప్రాంతంలోని మ‌చ్చు న‌దిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో బ్రిడ్జి మీద నుంచి వెళుతున్న సంద‌ర్శ‌కులు ఒక్క‌సారిగా న‌దిలో ప‌డిపోయారు. ఈ ప్ర‌మాదంలో ఇప్పటికైతే 32 చనిపోయిన‌ట్లు తెలుస్తోంది. న‌దిలో ప‌డిపోయిన వారు 400 మందికి పైగా ఉండొచ్చున‌ని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న తెలిసిన వెంట‌నే పోలీసు అధికారులు అక్క‌డికి చేరుకుని స‌హాయక‌ చ‌ర్య‌లు చేప‌ట్టారు. గ‌ల్లంతైన వారి ఆచూకీ కోసం వారి కుటుంబ స‌భ్యులు విల‌పిస్తున్నారు.

ఇంత‌కుముందే దెబ్బ తిన్న ఈ కేబుల్ బ్రిడ్జికి రిపేర్లు చేసిన త‌ర్వాత ఐదు రోజుల క్రితం సంద‌ర్శ‌కుల రాక‌పోక‌ల‌కు అనుమ‌తించిన‌ట్టు తెలుస్తోంది. గాయ‌ప‌డిన వారిని చికిత్స కోసం త‌ర‌లించేందుకు అంబులెన్స్‌ల‌ను మోహ‌రించారు. స్థానికుల సాయంతో గ‌ల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement