Monday, April 29, 2024

ప్యాకేజింగ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం

ఓ ప్యాకేజింగ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం తప్పింది. కాగా గుజరాత్‌లో వరుస ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల మోర్బీలోని కేబుల్‌ వంతెన కుప్పకూలి 142 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను మరువకముందే.. తాజాగా డామన్‌లోని దభేల్‌ ఏరియాలో శ్రీ గణేశ్‌ ప్యాకేజింగ్‌ పేరుతో ఉన్న ఓ ప్యాకేజింగ్‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో ఆస్తి నష్టమే తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో 8 ఫైరింజన్‌ల సాయంతో వాటిని ఆర్పేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement