Saturday, April 27, 2024

భారత్‌లో వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తి మృతి

కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఓ వ్యక్తి భారత్‌లో తొలిసారి మరణించాడు. క‌రోనా వ్యాక్సిన్ దుష్ప్ర‌భావాల‌పై అధ్య‌య‌నం చేస్తున్న ప్ర‌భుత్వ ప్యానెల్.. ఇండియాలో వ్యాక్సిన్ త‌ర్వాత తొలి మ‌ర‌ణాన్ని ధృవీక‌రించింది. ఓ 68 ఏళ్ల వ్య‌క్తి వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత అనఫిలాక్సిస్‌తో చ‌నిపోయిన‌ట్లు తేల్చింది. వ్యాక్సిన్ త‌ర్వాత క‌లిగే తీవ్ర దుష్ప్ర‌భావాల‌కు సంబంధించి నిపుణుల బృందం ఇచ్చిన రిపోర్ట్‌ను ఇండియా టుడే బ‌య‌ట‌పెడ్డింది. వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత మ‌ర‌ణించిన 31 మందిలో క‌లిగిన తీవ్ర దుష్ప్ర‌భావాల‌పై ఈ క‌మిటీ అధ్య‌య‌నం చేసింది. అందులో ఒక వ్య‌క్తి మాత్రం అన‌ఫిలాక్సిస్ వ‌ల్ల చ‌నిపోయిన‌ట్లు తేల్చింది.

ఆ వ్య‌క్తి మార్చి 8న వ్యాక్సిన్ తీసుకున్నాడ‌ని క‌మిటీ రిపోర్ట్ చెప్పింది. వ్యాక్సినేష‌న్ త‌ర్వాత క‌లిగే అన‌ఫిలాక్సిస్ వ‌ల్ల చ‌నిపోయిన తొలి వ్యక్తిగా క‌మిటీ తేల్చింది. అన‌ఫిలాక్సిస్ అంటే ఒక తీవ్రమైన‌ ఎల‌ర్జీ. నిజానికి మ‌రో ముగ్గురు కూడా వ్యాక్సిన్ వ‌ల్లే చ‌నిపోయినా.. ప్ర‌భుత్వం మాత్రం ఇదొక్క మ‌ర‌ణాన్నే ధృవీక‌రించింది. వ్యాక్సిన్ సంబంధిత ఇలాంటి రియాక్ష‌న్లు ముందుగా ఊహించిన‌వే అని ప్యానెల్ చెప్పింది. మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు కూడా వ్యాక్సిన్ త‌ర్వాత అన‌ఫిలాక్సిస్ బారిన ప‌డినా.. వాళ్లు చికిత్స త‌ర్వాత కోలుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement