Friday, April 26, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదారాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం తులానికి హైదరాబాద్‌లో రూ.53,050 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర తులానికి రూ.110 తగ్గింది. ప్రస్తుతం రూ.57,870 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.100 మేర తగ్గ ప్రస్తుతం రూ.53 వేల 200 వద్ద అమ్ముడవుతోంది.

మరోవైపు.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం దిల్లీలో 10 గ్రాములకు రూ.110 మేర దిగివచ్చింది. ప్రస్తుతం రూ.58, 020 వద్ద ఉంది. ఇక వెండి మాత్రం మళ్లీ భారీగా పెరిగింది. గత వారం రోజుల్లోనే మొత్తంగా కిలోకు రూ.5200 మేర పెరిగింది. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి ధర రూ.500 పెరిగి ప్రస్తుతం రూ.72, 500 పలుకుతోంది. ఇక దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి ధర రూ.500 పెరిగి ప్రస్తుతం రూ.69 వేల వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్‌తో పోలిస్తే దేశ రాజధాని దిల్లీలో బంగారం ధర కాస్త ఎక్కువ, వెండి ధర కాస్త తక్కువగా ఉంటుంది. అందుకు ప్రధానంగా స్థానికంగా ఉండే పన్నులు కారణంగా మారుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement