Wednesday, April 24, 2024

నేడు మరోసారి ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత

న్యూఢిల్లీ – ఎమ్మెల్సీ కవిత నేడు మరోసారి దిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. ఆమెను ఈ నెల 11న సుమారు 8 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు ఈ నెల 16న మరోసారి రావాలని సమన్లు జారీచేశారు. ఆ సమన్లను రద్దు చేయాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా..కవిత పిటిషన్​పై తక్షణమే విచారణ జరిపేందుకు నిరాకరించింది. ఈనెల 24న విచారణ చేపడతామన్న సీజేఐ ఈనెల 16న విచారణకు హాజరు కావడంపై ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిమంది పార్టీ కార్యకర్తలు నాయకులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఈడి విచారణ ఎటువైపుకు దారి తీస్తుందోనని ఆ పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement