Monday, May 6, 2024

నేటి బంగారం ధ‌ర‌లు – ఎంత పెరిగిదంటే..

నేడు అంటే గురువారం కూడా బంగారం ధ‌ర‌లు కాస్త పెరిగాయి. దాంతో వ‌రుస‌గా గ‌త మూడురోజుల నుంచి బంగారం ధ‌ర‌లు పెరుగుతూ వ‌స్తున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పెరుగుదలతో రూ.52,250కు చేరింది. అదేసమయంలో ఆర్నమెంటల్ గోల్డ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగింది. దీంతో ఈ పసిడి రేటు రూ.47,900కు చేరింది. బంగారం ధరలు పెరగం ఇది వరుసగా మూడో రోజు కావడం గమనార్హం. ఈ కాలంలో పసిడి రేటు రూ. 900కు పైగా పెరిగింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వెండి రేటు కూడా జిగేల్ మంది. దీని రేటు రూ. 400 పెరిగింది. దీంతో సిల్వర్ రేటు కేజీకి రూ. 66,500కు పరుగులు పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement