Wednesday, May 1, 2024

Breaking: రూ.36లక్షల విలువైన గోల్డ్ బార్స్ స్వాధీనం

ల‌క్నోలో చౌధ‌రి చ‌ర‌ణ్ సింగ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ఇమిగ్రేష‌న్ ప్రాంతంలోని కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా డ‌స్ట్‌బిన్‌లో ఆరు బంగారు క‌డ్డీల‌ను అధికారులు క‌నుగొన్నారు. స్వాధీనం చేసుకున్న గోల్డ్ బార్స్ విలువ మార్కెట్‌లో రూ 36.60 ల‌క్ష‌లుగా ఉంటుంద‌ని అధికారులు పేర్కొన్నారు. బ్లాక్ పాలిథిన్ క‌వ‌ర్‌లో ఆరు గోల్డ్ బార్స్‌ను చుట్టి ఎయిర్‌పోర్ట్ ఇమిగ్రేష‌న్ ఏరియా వ‌ద్ద డ‌స్ట్‌బిన్‌లో ప‌డ‌వేశార‌ని అధికారులు తెలిపారు. డ‌స్ట్‌బిన్‌లోకి గోల్డ్ బార్స్ ఎవ‌రు తీసుకువ‌చ్చి ప‌డ‌వేశార‌నేది గుర్తించేందుకు సీసీటీవీ కెమెరాల‌ను అధికారులు ప‌రిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement