Friday, April 19, 2024

విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందించాలి : మంత్రి హ‌రీష్ రావు

సిద్ధిపేట జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యా బోధన జరుగుతున్న తీరును రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అడిగి తెలుసుకున్నారు. ఏన్సాన్ పల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా సందర్శించారు. ప్రధానంగా పాఠశాలలో భోజనం అందుతున్న విషయమై విద్యార్థినీలను ఆరా తీశారు. గురుకుల పాఠశాల పరిసర ప్రాంతాలను సందర్శించి, క్యాంపస్ కలియ తిరిగి చూశారు. ఈ మేరకు విద్యార్థినీలతో కాసేపు ఆత్మీయతతో వారి విద్యా బోధన పై ముచ్చటించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందించాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement