Wednesday, May 1, 2024

Big Breaking | ఫుట్​బాల్​ చాంపియన్​గా భారత్​.. కువైట్​తో జరిగిన పోరులో విజయం

శాప్​ పుట్​బాల్​ చాంపియన్​షిప్​​ విజేతగా భారత్​ నిలిచింది. తొమ్మిదోసారి చాంపియన్​షిప్​ని భారత్​ సొంతం చేసుకుంది. కువైట్​పై జరిగిన పోటీలో 5–4 తేడాతో పెనాల్టీ షూట్​లో భారత జట్టు విజయం సాధించింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

SAFF చాంపియన్‌షిప్‌లో భారత్‌దే ఆధిపత్యం కొనసాగుతోంది. ఇవ్వాల (మంగళవారం) జరిగిన ఫైనల్‌ మ్యాచ్​లో కువైట్‌పై 5–4 తేడాతో.. షూటౌట్ విజయం సాధించింది. టోర్నమెంట్ చరిత్రలో భారతదేశం అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.  120 నిమిషాల పాటు కాలితో పోరాడిన తర్వాత, వారి నెం.1 కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధు సెమీస్‌లో అతను చేసిన పనిని చేశాడు. పెనాల్టీని అడ్డం పెట్టుకుని భారత్‌కు విజయాన్ని బహుమతిగా అందించాడు. అయితే గురుప్రీత్ తగినంత ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాడు, భారతదేశంలో SAFF ఫైనల్‌ను ఎన్నడూ కోల్పోని గర్వించదగ్గ రికార్డు నెలకొల్పింది.

ప్రధాన కోచ్ ఇగోర్ స్టిమాక్ నేతృత్వంలో ఇది భారతదేశానికి రెండో వరుస SAFF విజయం.  అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌ ఆరంభం పర్ఫెక్ట్‌గా ఉంది. కువైట్ జటట్ఉ బంతిని వేగంగా తరలించి భారత డిఫెండర్లను తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు లాగి మెరుగైన ఆటతీరును ప్రదర్శించే అవకాశం కల్పించారు. సునీల్‌ ఛెత్రీ సారథ్యంలోని బారత ఫుట్‌బాల్‌ జట్టు కొంతకాలంగా అదరగొడుతోంది. భారత జట్టు జోరు చూస్తుంటే పూర్వవైభవం సాకారం కానుందనే అనిపిస్తోంది.

- Advertisement -

స్వాత్రంత్యం ముందే భార‌త్‌కు ఈ ఆట‌లో ప్రత్యేకత స్థానం ఉంది. అయితే.. ఆ తర్వాత కాలంలో క్రికెట్‌కు ఆదరణ పెర‌గ‌డంతో ఒకింత ప్రాభవాన్ని కోల్పోయింది. ఈ ఏడాది టీమిండియా ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో తొమ్మిది గెలిచింది. ఇంటర్‌కాంటినెంటల్‌ కప్‌లో భారత్‌ విజేతగా నిలిచి ఔరా అనిపించింది. ఫైనల్‌లో లెబనాన్‌పై 2-0తో గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది. రెండేసి గోల్స్‌ చేసిన సునీల్‌ ఛెత్రీ, లాల్‌జింగులా చాంగ్టె టాప్‌లో నిలిచారు. బెంగళూరులో జరిగిన దక్షిణాసియా ఫుట్‌బాల్‌(సాఫ్‌) చాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement