Friday, May 3, 2024

జేసీబీతో వర్క్ చేస్తుంటే గ్యాస్ లీకేజీ .. ఆందోళన లో ప్రజలు

బాబూపల్లి, ( ప్రభ న్యూస్): హైదరాబాద్ సమీపంలోని Nizampet ఇండియన్ గ్యాస్ గోదాము సమీపంలో రిపేర్ల కోసం జేసీబీ తో తవ్వుతుండగా గ్యాస్ పైపు పగిలి గ్యాస్ లీకవుతోంది. వెంటనే జేసీబీ డ్రైవర్ రిపేర్లకోసం నిలిపేశారు. ఈ విషయాన్ని కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందించారు.

కార్పొరేషన్ అధికారులు బాగ్యనగర్ గ్యాస్ కంపెనీకి సమాచారం అందించారు. కాగా, గ్యాస్ లీక్ కావడంతో ఘాటైన వాసన వెలువడుతోంది. ఎలాంటి అగ్ని ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement