Friday, April 26, 2024

రైతు బాంధవుడు కేసీఆర్ : ఎమ్మెల్యే దాసరి

దేశంలో ఏ ముఖ్యమంత్రి రైతులను పట్టించుకోలేదని, రైతులకు పెట్టుబడి ఇచ్చి రాజును చేస్తున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అసలైన రైతు బాంధవుడు అని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయ‌న‌ మాట్లాడుతూ… జన్మంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గొడుగు రాజ కొమురయ్య, అధ్యక్షుడు నిదానపురం దేవయ్య, ఛైర్మెన్ చదువు రామచంద్రారెడ్డి, ఎంపీటీసీ నిర్మల – మల్లారెడ్డి, యూత్ మండలాధ్యక్షుడు నూనెటి కుమార్, గ్రామ శాఖ అధ్యక్షుడు కూకట్ల నవీన్, తెరాస నాయకులు జంగ రమణారెడ్డి, ఈర్ల శ్రీనివాస్, పత్తి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ రాంచంద్రం, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement