Sunday, April 28, 2024

Delhi: మృగాళ్ల పైశాచికత్వం.. పన్నెండేళ్ల బాలుడిపై గ్యాంగ్​ రేప్​, ప్రైవేట్​ పార్ట్స్​లో రాడ్​లు చొప్పించి..

దేశ రాజధాని ఢిల్లీలో ఆడాళ్లే కాదు.. ఇప్పుడు మాగాళ్లకు కూడా రక్షణ లేకుండాపోయింది. ఓ పన్నెండేళ్ల బాలుడిపై దారుణం జరిగింది. నలుగురు వ్యక్తలు కలిసి ఆ కుర్రాడిని దారుణాతి దారుణంగా కొట్టి హింసించి రేప్​ చేశారు. అతని ప్రైవేట్​ పార్ట్స్​లో రాడ్​ చొప్పించినట్టు డాక్టర్లు చెప్పారు. ఇక ఈ విషయమ్మీద ఢిల్లీ మహిళా కమిషన్​ (డీసీడబ్ల్యూ) చైర్​పర్సన్​ స్వాతి మలివాల్​ సీరియస్​ అయ్యారు. ఇవ్వాల (ఆదివారం) సోషల్​ మీడియాలో ఈ దారుణ విషయాన్ని పోస్టు చేశారు.

ఈ వ్యవహారంపై డీసీడబ్ల్యూ బృందం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని స్వామి మలివాల్​ తెలిపారు. నలుగురు నిందితుల్లో ముగ్గురు పరారీలో ఉండగా.. ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల18వ తేదీన తమ బిడ్డపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులకు విమెన్స్​ కమిషన్​ నోటీసులు జారీ చేసింది. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, ట్రీట్​మెంట్​ కొనసాగుతోందని డాక్టర్లు చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement