Friday, March 15, 2024

నాటు నాటుకి స్టెప్పులేసిన.. జీ20 ప్ర‌తినిధులు

ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు ఆ మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎంఎం కీరవాణి ఏ సందర్భంలో బీటు కొట్టాడో కానీ.. ‘నాటు నాటు’ హవా మాత్రం ఆగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోయింది. ప్రతిష్ఠాత్మక జీ20 సమావేశాలనూ తాకింది. ప్రతిష్ఠాత్మక జీ20 సమావేశాలనూ తాకింది.ప్రస్తుతం భారత దేశం అధ్యక్షతన జీ20 సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో అగ్రికల్చర్ డిప్యూటీస్ మీటింగ్ (ఏడీఎం) ఆఫ్ అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్’ సమావేశం చండీగఢ్ లో జరిగింది. ఈ భేటీకి హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు.. నాటు నాటు పాటకు కాలు కదిపారు. స్థానిక కళాకారులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement