Tuesday, May 7, 2024

FLASH: స్కూల్ బస్సును ఢీకొన్న లారీ.. నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు

ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలం బెండరా వద్ద పాఠశాల బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమం ఉంది. దీంతో ముగ్గురు విద్యార్థులకు ఆసిఫాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించిన మరో విద్యార్థిని మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థులు భీంపూర్ వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ ఆపకుండా పారిపోయాడు. దీంతో లారీని గాలించి డ్రైవర్ ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. గాయపడిన విద్యార్థులు మిట్ట విష్ణు, గంగిశెట్టి కార్తీక్, పుల్లం కార్తీక్, పుల్లం సహర్షిత్ ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నట్లు వాంకిడి సబ్ ఇన్‌స్పెక్టర్ దీకొండ రమేష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement