Sunday, April 28, 2024

య‌మునా ఎక్స్ ప్రెస్ వేకి మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్ పేయి పేరు..

ఈ నెల 25న గౌత‌మ్ బుద్ధ‌న‌గ‌ర్ జిల్లాలోని జెవార్ లో నోయిడా అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో య‌మునా ఎక్స్ ప్రెస్ వే పేరును మారుస్తూ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. విమానాశ్రయ శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీకి చెందిన ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఎక్స్‌ప్రెస్ వే పేరును మారుస్తూ అధికారికంగా ప్రకటన చేయనున్నట్టు బిజెపి సీనియర్ నేత ఒకరు చెప్పారు. య‌మునా ఎక్స్ ప్రెస్ వేకు మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్ పేయి పేరు పెట్టాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement