Thursday, April 25, 2024

India Corona: దేశంలో భారీగా తగ్గిన కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే..

దేశంలో క‌రోనా రోజువారి కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన క‌రోనా బులిటెన్‌ ప్రకారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 7,579 కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనాతో 236 మంది మృతి చెందారు. అదే సమయంలో 12, 202 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులైయ్యారు.

దీంతో దేశంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,45,26,480 కి చేరింది. ఇందులో 3,39,46,749 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,13,584 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వ‌ర‌కు క‌రోనాతో 4,66,147 మంది మృతి చెందారు. మొత్తం 1,17,63,73,499 మంది టీకాలు తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement