Saturday, April 20, 2024

మండలి రద్దు నిర్ణయం వాపస్​.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటోంది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోనుంది. ఈ రోజు అసెంబ్లీలో మరో కీలక ప్రకటన వెలువడే అవకాశముంది. గతంలో శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇప్పుడు ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ మరో తీర్మానాన్ని తెచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఉపసంహరణ తీర్మానం కాపీని కేంద్రానికి పంపనుంది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. మరోవైపు ఇవాళ మండలి ముందుకు మూడు రాజధానుల చట్ట ఉపసంహరణ బిల్లు రానుంది. చట్ట ఉపసంహరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement