Wednesday, May 1, 2024

ఆస్పత్రిలో సోనియా గాంధీ.. నిలకడగా ఆరోగ్యం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి అనారోగ్యం బారినపడ్డారు. ఆమెను ఢిల్లీలోని సర్‌ గంగారాం ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. చెస్ట్‌ మెడిసిన్‌ విభాగం సీనియర్‌ కన్సల్టంట్‌ అరూప్‌ బసు బృందం సోనియా గాంధీకి వైద్యం అందజేస్తోంది. ఆమె జ్వరంతో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు. 2022లో రెండుసార్లు కోవిడ్‌-19 బారినపడ్డ సోనియా గాంధీ ఆ తర్వాత కరోనా అనంతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ ఏడాది జనవరి 3న అనారోగ్యం పాలవడంతో ఆస్పత్రిలో చేర్చారు.తాజాగా కొద్ది రోజుల క్రితం చత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశాల్లో సోనియా గాంధీ పాల్గొన్నారు. ఇక తాను విశ్రాంతి తీసుకుంటానంటూ ప్రకటించిన సోనియా గాంధీ, భారత్‌ జోడో యాత్ర కాంగ్రెస్‌కు ఒక టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement