Thursday, April 25, 2024

Flash.. Flash: కేటీపీపీ ఉద్యోగి ఆత్మహత్య

గణపురం, (ప్రభన్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఘోరం జ‌రిగింది. చెల్పూర్ శివారు కేటీపీపీ ఉద్యోగి ఈ రోజు ఆత్మహత్య చేసుకున్న‌ట్టు స్థానికులు తెలిపారు. కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో జేపీఏగా విధులు నిర్వహిస్తున్న కూచన రఘుపతి చెల్పూర్ బస్టాండ్ ప్రాంతంలో పురుగుమందులు తాగాడు.

అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే ర‌ఘుప‌తి అప్పటికే చ‌నిపోయిన‌ట్టు డాక్ట‌ర్లు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement