Thursday, April 18, 2024

మ‌హాపాద‌యాత్ర‌లో ‘టిడిపి’ నాయ‌కులు..’సి.పి.ఐ’ మ‌ద్ద‌తు..

రాజ‌ధాని రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర నాగులుప్ప‌ల‌పాడు మండ‌లంలో కొన‌సాగుతోంది. రైతులు న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు పేరుతో ఈ మహా పాదయాత్రని చేప‌ట్టారు. గొట్టిపాటి రవికుమార్ ,సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బి.ఎన్ విజయ్ కుమార్ , మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మనోజ్ కుమార్ ఈ పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు. సి.పి.ఐ పార్టీ ఈ పాదయాత్రకు మద్దతు తెలిపింది. కొరిసపాడు మండలం రాచపూడి నుండి నాగులుప్పలపాడు మండలంలోకి ప్రవేశించిన మహా పాదయాత్ర మండల కేంద్రమైన నాగులుప్పలపాడు చేరుకుని రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకొని గురువారం చదలవాడ, మద్దిరాలపాడు మీదుగా ఒంగోలు వైపుకు పాదయాత్ర కొనసాగించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement